గురువు గురువు పరమగురువు
శ్రీసాయినాథాయనమః
సద్గురువులు కర్మసూత్రాన్న( law of karma ) నుసరించిగాక, కారుణ్యసూత్రం ( law of compassion ) పై వ్యవహరిస్తారని పెద్దలు చెబుతారు. భక్తులు తమ తమ కర్మఫలముల ననుసరించి అనుభవింప వలసిన శారీరక బాధలుగాని , మానసిక అలజడులు గాని లేక ఆధ్యాత్మిక చీకట్లుగాని అనుభవింప శక్తిలేనపుడు సద్గురువులు వారి కర్మ భారముల భరించి, తమ దయాహృదయంతొ వ్యవహిరించి వారి సమస్యల పరిష్కరిస్తారనేది విజ్ఞుల ఉవాచ. ఇందులకు శ్రీసాయిసచ్చరిత్రలోని ఘటనలన్నీ ఉదాహరణలే! శ్యామా పాముకాటునుండి రక్షణపొందుట, భీమాజిపాటిలు క్షయవ్యాధి విముక్తి , పితళే పుత్రుని మూర్చవ్యాధి నివారణ, పిళ్లే నారి పుండు ఉపశమనం,మైనతాయి సుఖప్రసవన,తాత్యాకు ప్రాణభిక్ష ; పాటంకరు, కాకాజీవైద్య, గురుచరిత్రపఠించిన సాఠే ల మానసిక కల్లోలత నుండి ప్రశాంతత ; దాసగణు,బి.వి.దేవ్,నానాసాహెబ్ చాందోర్కరుల ఆధ్యాత్మిక అంధకార నిర్మూలన ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు కేవలము మచ్చుతునకలు మాత్రమే!
సాయిబాబా ఎందరో భక్తుల బాధలు తమ దేహంపై ధరించి వారిని రక్షించారు. వారికర్మ భారముల తాము వహించారు. అలాంటి దయాంతరంగుల సర్వశ్య శరణాగతి కోరడం కేవలం భక్తుల మేలుకొరకేగదా! వారు భక్తులనుండి ఆశించేది ఎలాంటి షరతులు లేని పరిపూర్ణసమర్పణ. వ్యక్తులు ఎనలేని భక్తివిశ్వాసాలతో పరమభక్తులుగా రూపాంతరం చెందాలి. శ్రీరామకృష్ణ పరమహంసల వారు చెప్పినటుల నీటమునిగే ప్రమాదంలోని వ్యక్తి, శ్వాసకై మిగుల తపించినట్లు దైవ, సద్గురు కృపల పొందుట కొరకు మనిషి పరితపించాలి. అలాంటి సర్వశ్య శరణాగతిచే ఎందరో రక్షింపబడ్డారని మన పురాణాల్లో , ఇతిహాసాలలో చెప్పబడింది. అలాగే భరింపలేని బాధలను , భారాలను సద్గురునికి విన్నవించుకోవడంలో ఎలాంటి మీమాంస ఉండకూడదు. మనకేది మంచిదో అదే సద్గురువులు చేస్తారనే మొక్కవోని విశ్వాసం భక్తుల శ్రేయస్సు కొరకే!
గురువు గురువు పరమగురువు
గురువు గురువు పరమగురువు సాయిదేవుడుపదము పదము తోడునడచు ప్రేమరూపుడు
సాయిదేవుడు....ప్రేమరూపుడు
వడిదుడుకుల వలయములో
మది అలజడి తరుణములో
కనులు కనులు కలిపి చూడు
మదియ గడియ విడచి చూడు || గురువు గురువు ||
సుడుల గిరుల వలయములో
కారుకడలి పయనములో
నడువు నడువు గుడికి నడువు
బిడియమేల సాయి నడుగు || గురువు గురువు ||
ఇడుముల చదరంగములో
విడివడని బంధములో
అహము విడచి వడిగ నడువు
ఇహము పరము గురువు బరువు || గురువు గురువు ||
Let Sad Guru know our crisis, with surrender and appeal!
ReplyDelete