అమ్మ ఒడి
అమ్మ ఒడి
శ్రీసాయినాథాయనమః
జైసాయిమా!
పాఠక మహాశయులెల్లరకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
పాఠక మహాశయులెల్లరకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
తల్లివిలువ వెలకందనిది !
" అమ్మలగన్నయమ్మ మువ్వురమ్మల మూలపుటమ్మ..."
ఆదిపరాశక్తి అమ్మలకు అమ్మ, లక్ష్మీ పార్వతి సరస్వతీ దేవీమూర్తులకు అమ్మ. సాయినాథులు తమను ఆదిపరాశక్తిగా చెప్పియున్నారు ( శ్రీసాయిసచ్చరిత్ర, 3వ అధ్యాయము ). అనగా సాయిదేవులు మాతృమూర్తి యని నెరుగవలెను. దయాసాగర మాతృమూర్తికి శతకోటి ప్రణామాలు!
సాయిబాబా మజీదుకు ద్వారకామాయి అని పేరుపెట్టారు. మాయి అంటే తల్లి యని అర్ధం. ద్వారకామాయిలో ప్రవేశించిన వారిని తల్లిలా ప్రేమిస్తుందని,రక్షిస్తుందని బాబా భావం కావచ్చు. బాబా చరిత్ర చదివిన వారికీవిషయం తేటతెల్లం కాగలదు. నాలుగవ దత్తావతారులైన శ్రీ అక్కల్కోట స్వామి గురుప్రేమను తల్లిప్రేమకు వెయ్యిరెట్లుగా అభివర్ణించారు. సాయిబాబా తామే పరాశక్తిగా చెప్పియున్నారు. జగన్మాతను సృష్టి కారిణి, సృష్టి పోషిణి, సృష్టి ఉద్ధారిణి, భయనివారిణి , భవభయహారిణిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈవివరణ సాధారణ అవగాహనకు అంత సులభము కాదు. కాని బాబావిషయంలో పెక్కుభక్తులకు అనుభవైకవేద్యం. శ్రీసాయిసచ్చరిత్రములోని సాయి కరుణామృతమును వివరించు కొన్నిముఖ్య సంఘటనలను వివరించుకొందాము. ఆ ద్వారకామాయి తల్లి దీవెన,రక్షణ అందరికి లభించాలని ప్రార్థిద్దాం,ఆ కరుణామయి తల్లిఒడిలో సేదదీరుదాం!
" ఊరడిల్లుము! నీ ఆతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ , బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈమసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారీరోగమును తప్పక బాగుచేయును. ఆ ఫకీరు అందరిని ప్రేమతోను దయతోను కాపాడును. " భీమాజీ పాటిలు క్షయనివారణ , 13వ అధ్యాయము
" నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునెదరో వారిని ఆమె కష్టములనుండి యాతురతలనుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పించును. ఆమె ఒడి నాశ్రయించినవారి కష్టములన్నియు సమసి పోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును. " బాలాసాహెబ్ మిరీకరును సర్పగండమునుండి కాపాడుట, 22వ అధ్యాయము
" భయపడవద్దు,ఏమాత్రము చింతించకు. ఈదయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికిపోయి ఉరక కూర్చుండుము. బయటకు పోవద్దు. నాయందు విశ్వాసముంచుము. భయపడకుము. ఆందోళన పడవద్దు." శ్యామాను పాము కాటునుండి రక్షించు వేళ ,
23వ అధ్యాయము.
" ఎవరైతే ఈమసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో ఏవ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారమురోజులలో నయమగును.దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదుకాదు,ద్వారవతి.ఎవరైతే ఇందు కాలుమోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. " డాక్టరు మేనల్లుని రాచకురుపు బాధావిముక్తి సందర్భములో, 34వ అధ్యాయము.
" ఈపాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీకష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును." సపత్నేకరును ఆశీర్వదించి పుత్రసంతానము కలిగించుట, 48వ అధ్యాయము
అమ్మఒడి
దొరికెనులే అమ్మ ఒడి
ద్వారకామాయి
యది
ద్వారకామాయియది
ఆపదా... హారిణది
నా నడకల తొలుతబడి
నా పలుకుల మొలకనుడి
నా పిలుపుల వినెడిగుడి
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ ఒడి ||
గురుదేవుల
గురుకులమది
నందబాల
గోకులమది
దీపమాల
శోభితమది
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ ఒడి ||
రాజరాజ
మందిరమది
యోగిరాజ
సుందరమది
కోటిసూర్య
యోగంబది
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ
ఒడి ||
సాయితేజ
నందనమది
మాయమోహ
ధ్వంసకమది
లోక లోక పాలకమది
Bow to Sri Sai, the most compassionate and loving Mother!
ReplyDelete